
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 22 (TS24/7 తెలుగు న్యూస్): జగదేవ పూర్ పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందనీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి. పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి లు అన్నారు.
మండలం లోని గొల్లపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ, మరియు రాజు లు కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పటల్ లో చేరగా వారికి అధికంగా డబ్బులు ఖర్చు కాగా సీఎం సహయనిధికీ అప్లై చేసుకోగా వారికీ సీఎం సహయనిధి నుండి మజురైన చెక్కులు సత్యనారాయణ కు 11,000/- రూపాయలు,రాజు కు 7,000/- రూపాయల చెక్కులను బాధితులకు మండల నాయకులతో కలసి జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్,సర్పంచ్ ల పొరమ్ మండల అధ్యక్షులు నరేష్ , కో అఫ్షన్ ఎక్బల్,ఎంపీటీసీలు కవిత,రమ్య, గొల్లపల్లి సర్పంచ్ మమత ,అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ మహేందర్, ఉపసర్పంచ్ సిద్ధులు తదితులున్నారు.




