Breaking News

రక్త దాన శిబిరాలు..

100 Views

వర్గల్ మండల్ సెప్టెంబర్ 21:రక్త దానం ఇతరులకు పునర్జన్మ. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

వర్గల్,రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ ఆధ్వర్యంలో రెడిన బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో వర్గల్ మండలంలోని తునికి ఖాల్స గ్రామంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ అధ్యక్షులు బాబు గౌడ్ మాట్లాడుతూ.. రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయొచ్చని ఈ సందర్భంగా తెలిపారు. రక్తదానం రక్తదానాన్ని చేసిన ప్రతి ఒక్కరిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు రక్తాన్ని దానం చేయాలన్నారు. రోటరీ క్లబ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్, షూస్ ను ఉచితంగా పంపిణి చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ రక్త దాన శిబిరంలో సుమారు 50 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెంబెర్ అట్రాక్షన్ చైర్మన్ చంటి, వాటర్, శానిటేషన్ చైర్మన్ కర్ణాకర్ రెడ్డి, పూర్వ అధ్యక్షులు డాక్టర్ పురుషోత్తం, జగదీశ్వర్, డిసిసిబి డైరెక్టర్ అంజిరెడ్డి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *