ముస్తాబాద్, సెప్టెంబర్20, మండలంలోని గూడెం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ రాజూరి సద్గుణాచారికి తెలుగు భాషాదినోత్సవం 2023 పురస్కరించుకొని కళాప్రపూర్ణ జాతీయ పురస్కారం ప్రదానం చేసారు. తెలుగు వెలుగు సాహితి వేదికవారు ప్రతియేటా నిర్వహించే పురస్కార ప్రదనోత్సవాల్లో భాగంగా ఈసంవత్సరం హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధులుగా శ్రీ దైవజ్ఞ శర్మ , డా.శాంతి కృష్ణ ఆచార్య, పోలోజు రాజ్ కుమార్, రాచకొండ డిప్యూటీ కమిషనర్ గిరిధర్, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదనమోహన చారి పాల్గొన్నారు .
