దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆదివారం విశ్వకర్మ జయంతి సందర్భంగా శివాజీ చౌరస్తాలో జెండాను ఎగరవేసి విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి లు మాట్లాడుతూ విశ్వకర్మలను ప్రభుత్వం గుర్తించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు బాలా చారి, సభ్యులు చింటూ, బ్రహ్మచారి,రమేష్, నర్సింహా చారి, రాములు, లక్ష్మణ్, వెంకటేశం, చక్రపాణి, అశోక్, శివకుమార్, రాజు, నాగరాజు,సంతోష్, రాజు, శేషాద్రి, శ్రీనివాస్, స్వామి, ఉపేందర్, యాదగిరి, చంద్రం, తదితరులు పాల్గొన్నారు….




