దౌల్తాబాద్: పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్ సుగుణ యాదగిరి అన్నారు. గురువారం మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా మొక్కలు నాటాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభాకర్, పంచాయతి కార్యదర్శి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు….
