Breaking News

రైతుల సమస్యలు పరిష్కరించాలని బిజెపి నాయకులు నిరసన 

102 Views

 

 

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొలిపాక రాజు ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు మరికంటి ఎగొండ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం రోజున లక్ష రూపాయల రుణమాఫీ, పసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని ధరణిలో లోటుపాట్లు సవరించి రైతులకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా గజ్వేల్ అసెంబ్లీ లోని నియోజకవర్గం లోనీ గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతు ధర్నాలో సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శులు మన్నె శ్రీనివాస్ పాలకొల్లు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్ లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జాప్యం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న రోజుల్లో రైతులు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, పంజాల అశోక గౌడ్, సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి పూదరి నందన్ గౌడ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ధర్మ గురువారెడ్డి, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు నాలుగమ శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి కుడికెల రాములు, అసెంబ్లీ కో కన్వీనర్ బండారు మహేష్, ఎలికాంటి సురేష్, గజ్వేల్ నియోజకవర్గం మండల అధ్యక్షులు ములుగు పల్లె రమేష్ యాదవ్, వర్గల్ మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్, సిద్దిపేట జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు మనోహర్ యాదవ్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి శివకుమార్, సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గం ఎస్ సి మోర్చా అసెంబ్లీ కన్వీనర్ ఆకారం అశోక్, గజ్వేల్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్, గజ్వేల్ నియోజకవర్గం కిసాన్ మోర్చా గజ్వేల్ మండల అధ్యక్షులు పంజా బాలు, జగదేపూర్ మండల అధ్యక్షులు బత్తుల వెంకటేష్, ములుగు మండల అధ్యక్షులు నరసారెడ్డి, గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు మైస విజయ్, ఎస్ సి మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డమీద ప్రశాంత్, ములుగు మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి నవీన్, బీజేవైఎం గజ్వేల్ పట్టణ అధ్యక్షులు రజినీకాంత్ యాదవ్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్, ఢిల్లీ బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు సిలువేరు జనార్ధన్, పవన్ కుమార్, భీనమైన ప్రభాకర్, మన్నే శేఖర్,గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు నరసింహ చారి, రైతులు ర్యాలీగా బయలుదేరి నిరసన కార్యక్రమం చేపట్టారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *