యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాకేష్ కృష్ణన్ నియామకం
సెప్టెంబర్ 16
సిద్దిపేట చేర్యాల మండలం చిట్యాల గ్రామానికి చెందిన బందీగా రాకేష్ కృష్ణన్ గత ఏడు సంవత్సరాల నుండి కాకతీయ యూనివర్సిటీ వేదికగా కాంగ్రెస్ పార్టీ పక్షాన విద్యార్థి నిరుద్యోగ ప్రజా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కొట్లాడుతూ తన పదునైనా మాటలతో ప్రశ్నిస్తూ అనేక రకాల ఉద్యమాలు చేయడం జరిగింది
,ఆక్రమంలో వరంగల్ & హన్మకొండ నగరాలకు వివిధ కార్యక్రమాలకు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు మున్సిపల్ & ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావ్ కూడా శాంతి యుతంగా విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాన్వాయ్ ని కూడా అడ్డగించడం జరిగింది
దానికి పోలీసులు అనేక రకాల కేసులు పెట్టి జైల్లో నిర్భంధించడం జరిగింది, అంతే కాకుండా జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేస్తున్న అనేక రకాల భూకబ్జా లపై సోషల్ మీడియా ఆధారంగా ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడటం జరిగింది
చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఏర్పడిన జేఏసీ లో కీలకంగా ఉండి అనేక రకాల కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొని వివిధ సందర్భాల్లో దీనిని గమనించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మంత్రి హరీష్ రావ్ ని కూడా తమ చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అడ్డుకొని ప్రశ్నించడం జరిగింది,
ఆయన అన్నిరకాల పోరాటాలకు ఉద్యమాలను మరియు పార్టీ కోసం పనిచేస్తున్న తీరును అభినందిస్తూ,అది నాయత్వం ఇలాంటి చదువుకున్న మరియు విద్యార్థి ఉద్యమకారులకు కష్ట పడి పనిచేసే వారికి తగిన స్తానం పార్టీలో కల్పించి ముందుకు నడిపించాలని ఆలోచించి తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గా నియమించడం జరిగింది*,





