
తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 15
మంగపేట మండలం మల్లూరు చుంచుపల్లి గ్రామలలోని అంగ న్వాడీ కేంద్రలలో సీడీపీఓ అధ్యక్షతన మల్లూరు సెక్టార్ సూపెర్వైసోర్ తెల్లం విజయ లక్ష్మి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమంను నిర్వ హించారు.పిల్లల తల్లులు పోషకాల ఆహారంను ప్రతి రోజు అంగన్వాడీకి వచ్చి భోజనం ఇక్కడే తినాలని అదేవిదంగా పిల్లల బరువులను కూడా తెలుసు కోవచ్చని మనకు అందుబాటులో ఉన్న ఆకు కూరలను అంగన్వాడీ లో ఇచ్చే గుడ్డు పాలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి స్కూల్ టీచర్ అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.




