సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 27(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన జంబుల చంద్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ టెంపుల్ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు నరేష్, ఎంపిటిసిల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, అంతాయగూడెం సర్పంచ్ జిల్లా ముదిరాజు సంఘం యూత్ విభాగం అధ్యక్షులు తీగుల్ల
సత్యం, చాట్లపల్లి ఉప సర్పంచ్ అజాం, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్,నాయకులు కొంపల్లి కిరణ్ తదితరులున్నారు.
