ముస్తాబాద్, ప్రతినిదీ వెంకటరెడ్డి సెప్టెంబర్14, ఇందిరాపార్క్ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన దీక్షను భగ్నంచేసారనె సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బిజెపిశ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహనికి పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్ ఆధ్వర్యంలో పూలమాలలువేసి నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టారు. బీజేపి మండల ప్రధాన కార్యదర్శులు సౌల్లక్రాంతి కుమార్, కోల కృష్ణా, మెంగని మహేందర్, చిట్నేనిశ్రీనివాసరావు జిల్లా కార్యాలయ సహాయక కార్యదర్శి భాదనరేష్ మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని దీక్షచేస్తూన్న రాత్రి సమయంలో అరెస్టు చేసి దీక్షను భగ్నం చేయడంతో పాటు పోలీసులు మంత్రిని అదుపులోకి తీసుకొని ఇందిరాపార్క్ నుంచి బీజేపీ కార్యాలయానికి తరలించారు. ఇలాంటి అరాచకాలు బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూఉంటే రానున్న రోజుల్లో తగినబుద్ధి చెప్తామంటూ చాలా సిగ్గుచేటు ఈచర్య ఆప్రజాస్వామీకంమని అన్నారు. ఈకార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోలకృష్ణగౌడ్, మండల ఉపాధ్యక్షుడు కాసోడి రమేష్ ఎదునూరు గోపి, కళ్యాణ్ యాదవ్, నామాపూర్ తిరుపతి, మద్దికుంట రమేష్, బండి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




