కొండపాక: కొండపాక మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నిమ్మ నరసింహ రెడ్డి(మనం),ఉపాధ్యక్షులుగా గోనె రమేశ్(మన తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా దేవి కిరణ్(వార్తా), కోశాధికారిగా జంజిరపు సంజీవ్(నవ తెలంగాణ), గౌరవ సలహాదారుగా చిలుముల వెంకటేశం(నమస్తే తెలంగాణ)లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అంకిల్ల కనకా రెడ్డి, వడ్లకోండ శ్రీనివాస్, పాలడుగు బాల్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.




