హైదరాబాద్ సెప్టెంబర్ 12:బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.
సెప్టెంబర్ 15న మధ్యాహ్నం ప్రగతి భవన్ లో, పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.
సెప్టెంబర్ 18వ తేదీ నుండి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించడానికి, పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కోరారు.




