చిన్నబోయిన యాదయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్*
సెప్టెంబర్.12
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చిన్నబోయిన యాదయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ అవసరాల ఖర్చుల కొరకు 5000 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు. ఆయనతో పాటుగా నాయకులు జుట్టు సుధాకర్ చిన్నబోయిన లక్ష్మణ్ రాజు నరేష్ కుమార్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు*





