సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు
ములుగు,సెప్టెంబర్ 06
ముఖ్యమంత్రి కెసిఆర్ కి ములుగు జడ్పీ చైర్ పర్సన్ ములుగు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి ధన్యవాదాలు తెలియజే శారు.ములుగు నియోజకవర్గానికి ఎస్డిఎఫ్ ద్వారా 56 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజ కవర్గ అభివృద్ధికి కేటాయించ డం సంతోషకరమని ఈ నిధుల కేటాయింపు మూలంగా నియో జకవర్గంలోని గ్రామాల మధ్య లింక్ రోడ్లు అభివృద్ధి చెంది పూర్తిస్థాయిలో రవాణా సౌక ర్యాలు సులభతరం కానున్న యన్నారు.ములుగు నియోజ కవర్గం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న ప్రేమ మరొకసారి బయటపడింది అన్నారు. కేటాయింపుకు సహకరించిన ములుగు జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యవతి రాథోడ్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.




