గంభీరావుపేట మండలం లో రెండు మూడు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు నర్మాల ఎగువ మానేరు మత్తడి నుండి నీరు ప్రమాదకరంగా దూకుతుండడంతో ప్రజల భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మానేరు డ్యామ్ ను చూడడానికి ఎవరిని అనుమతించడం లేదని,గంభీరావుపేట నుండి లింగన్నపేట నుండి పోయే వారందరికి దూర ప్రాంతాల నుండి, చుట్టుపక్కల, పరిసర ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విందించడమైందని ఈ సందర్భంగా గంభీరావుపేట పోలీసులు తెలిపారు. ఎవరు కూడా ఎగువ మానేరు వద్దకు రాకూడదని, ప్రస్తుతానికి రాకపోకలు నిలిపివేశామని ,ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని ఎస్ ఐ మహేష్ తెలియజేశారు..




