Breaking News

గజ్వేల్ లో జర్నలిస్టు ఆత్మహత్య*

123 Views

సిద్దిపేట జిల్లా, గజ్వేల్ కేంద్రంగా ఓ పత్రికలో పనిచేస్తున్న రిపోర్టర్ వేణుగోపాల్(34) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుండి బయలుదేరిన అతను, నిన్నటి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేణు ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీసులు, గజ్వేల్ పట్టణంలోని ఎర్రకుంటలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఆన్లైన్ అప్పుల భారం, వాటి వేధింపులు భరించలేక వేణు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతునికి భార్య, రెండేళ్ల వయస్సున్న ఇద్దరు కవల ఆడ పిల్లలున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *