గురుకుల కళాశాలలో 28న స్పాట్ అడ్మిషన్స్
సిద్దిపేట జిల్లాలోని దుద్దిడ గ్రామంలో గల కొండపాక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఖాళీగా ఉన్న సీట్లకు ఈనెల 28న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపల్ టి. శశిధర్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు పదవ తరగతి మెమో, కుల ఆదాయ ధ్రువపత్రాలతో ఈనెల 28న దుద్దిడ గురుకుల కళాశాలలో సంప్రదించగలరని విజ్ఞప్తి చేశారు.




