ఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు….
– జర్నలిస్టుల సమక్షంలో విజయబాబు నర్మదల పెండ్లి
పరిశోధనాత్మక రిపోర్టర్/ఎల్లారెడ్దిపేట :
ఇద్దరూ ఇష్టపడ్డారు ఇరు కుటుంబాల ఒప్పందంతో గుళ్లో వివాహం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు దుర్గం విజయబాబు అదే గ్రామానికి చెందిన నర్మదను గత కొంతకాలంగా ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి గురువారం రాచర్ల గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయంలో జర్నలిస్టుల సమక్షంలో పురోహితులు కృష్ణమాచారి నీలేశ్ పంతులు వివాహాన్ని జరిపించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులు, జర్నలిస్టులు బండారి బాల్ రెడ్డి, శ్రీరామోజు దేవరాజు, కొండ్లపు జగదీష్, శ్యామంతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.వధూవరులను ఆశీర్వదించారు.




