Breaking News

ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్రం: మహానుభావుల త్యాగాలని స్ఫూర్తిగా తీసుకోవాలి:

222 Views

15: గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలోని జెండా వద్ద ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచి పాశం బాపు రెడ్డి మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుటకు వెనుక ఎందరో త్యాగమూర్తుల ఫలితం ఉందని బ్రిటిష్ వారితో పోరాడి ఎంతోమంది త్యాగమూర్తులు భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని ఎందరో మహానుభావుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పాశం బాపురెడ్డి ఎంపీటీసీ అన్వర్ బేగం సాజిద్ ఉప సర్పంచ్ స్వరూప మల్లేష్ వార్డు నెంబర్లు పాశం సుదర్శన్ రెడ్డి ,నరసింహులు , బాలగిరి. పసుల స్వామి. గ్రామ పంచాయతీ సెక్రెటరీ జయరాం , బి ఆర్ఎస్ గ్రామా అధ్యక్షుడు రవీందర్ గౌడ్ సురేందర్ రెడ్డి డీలర్ శివ రాములు సత్య గౌడ్ బీసీ నాయకులు అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *