ప్రాంతీయం

మేమే ముద్రించిన పుస్తకములు, మేము ఇచ్చిన యూనిఫామ్ లు, అధిక ఫీజులు యాజమాన్యంపై మండిపడిన ఆరుట్ల మహేష్ రెడ్డి…

218 Views
      ముస్తాబాద్, ప్రతినిది వెంకటరెడ్డి ఆగస్టు8, మండల కేంద్రంలో కేకే యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అరుట్ల మహేష్ రెడ్డి పత్రికా సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ  యాజమాన్యం ముద్రించిన పుస్తకాలని కొనాలని మేము ఇచ్చిన యూనిఫామ్ నే ధరించాలి అంటూ పిల్లలపై వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు గడచిన సంవత్సరమే ఈ విషయమై మేము మండల విద్యాశాఖ అధికారికి జిల్లా విద్యాశాఖ అధికారికి కంప్లైంట్ చేసిన వారు తగిన చర్యలు తీసుకున్న యధావిధిగా పాఠశాలలు ప్రారంభమైన తర్వాత యాజమాన్యం తీరు యధాతధంగా ఉందన్నారు. అట్టి యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకొవాలని అన్నారు. అలాగే అందుబాటులో ఉన్న మండల విద్యాశాఖ సహాయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్ పట్టణ అధ్యక్షులు తాళ్ల విజయ్ రెడ్డి సీనియర్ నాయకులు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *