*రామగుండం నియోజకవర్గం*
గోదావరిఖని జిఎం ఆఫీస్ ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ.
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ మరియు రేణికుంట్ల ప్రవీణ్.
నేడు రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని సింగరేణి జీఎం ఆఫీస్ ఆవరణలో సింగరేణి కాలరీస్ షెడ్యూల్ క్యాస్ట్&షెడ్యూల్ ట్రైబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డా“ బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని ముఖ్య అతిథులు గా హాజరై ప్రారంభించిన జాతీయ ఎస్సి కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ .ఈ కార్యక్రమంలో జీఎం లలిత్ కుమార్ ,పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు,ఎస్సి,ఎస్టీ ఎంప్లాయిస్ నాయకులు యాట ఓదెలు గారు,లింగమూర్తి,నర్సయ్య ,సింగరేణి అధికారులు,కార్మికులు పాల్గొన్నారు.





