ప్రాంతీయం

పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి పథకం ఎంపీపీ…

309 Views
  •     ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు8 బంధనకల్ గ్రామంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులతోపాటు చీరను కానుకగా అందజేసిన ఎంపీపీ, ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని తల్లిదండ్రులకు ఆడబిడ్డల పెళ్లికోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి కష్టాలను తెలుసుకొని కల్యాణలక్ష్మి షాదీముబారక్ పథకంతో పెళ్లిళ్లకు అండగా ఉంటూ పేదవారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత బరాసకు దక్కిందన్నారు. పేదప్రజల కోసం రైతుబంధు, రైతుభీమా, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కలకొండ తెర్లుమద్ది సర్పంచ్ కిషన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు, ఎంపీటీసీ రామచంద్ర రెడ్డి, గ్రామశాఖ ఎనగందుల నర్సింలు, సురభి మాధవ రావు, మాజీ చిగురు నరేష్, కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రావు, కొమ్మాట వెంకటయ్య, కొరివి బాలయ్య, నల్ల శ్రీనివాస్ రెడ్డి, దొంగల నరేష్, బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *