ప్రాంతీయం

తౌర్య నాయక్ మరణం తీరని లోటు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

118 Views

దౌల్తాబాద్: నార్సింగ్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ సొసైటీ చైర్మన్ తౌర్య నాయక్ అకాల మరణం తనను ఎంతో కలిచి వేసిందని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు..శనివారం ఉదయం నార్సింగి మండలంలోని వల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తౌర్య నాయక్ తో పాటు ఆయన చిన్న కుమారుడు అక్కడికక్కడే మరణించడం జరిగింది..రామాయంపేట లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారి పార్థీవ దేహాలను దర్శించి నివాళి అర్పించారు.తౌర్య నాయక్ నిరుపేద కుటుంబంలో పుట్టి..స్వయం కృషి తో ఉన్నత స్థాయికి ఎదిగిండన్నారు..ఆయన అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు..ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించి, కుటుంబీకులకు పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *