378 Views

ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 5, ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన వంగ భూమగౌడ్, (పోతుగల్ భూమాగౌడ్) గత కొద్ది రోజుల క్రితం పరమపదించారు. ఈసందర్భంగా ఆయన తనయులు వంగ లక్ష్మీపతి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, వంగ స్వామిగౌడ్ దాతృత్వాన్ని ప్రదర్శించి తండ్రి జ్ఞాపకార్ధం కోసం పోతుగల్ గ్రామంలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతి గృహంలో సుమారు 60.కి పైచిలుకు విద్యార్థులకు భోజనానికి అవసరపడే ప్లేట్లును అరటి పండ్లును వితరణ చేశారు. ఈమేరకు మాజీ ఎంపిటిసి కుక్కల దేవేందర్, మాజీ ఎంఈఓ రామచంద్రం గౌడ్, విశ్రాంతి ఉపాధ్యాయులు బాలఎల్లం గౌడ్, వార్డెన్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found