ముస్తాబాద్, ప్రతినిధి జూలై 3, పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం మొఱ్ఱయిపల్లి గ్రామంకి చెందిన బద్దిపడగ అంజిరెడ్డి అనూష దంపతుల కూతురు నామాపూర్ మోడల్ స్కూల్ లో చదివిన విద్యార్థికి పదో తరగతిలో 9.5 రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. త్రిబుల్ ఐటీ బాసరలో సీటు రావడంతో కూతుర్ని చూసి గర్విస్తున్నారు. ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు. నరేంద్ర చారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు మించి ఫలితాలు టాపర్స్గా నిలిచిన ముస్తాబాద్ మండల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధిస్తూ ప్రతిభకనబరిచారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులు ఉత్తీర్ణులైతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆంగ్ల మాధ్యమంలో బోధనతో ఉత్తమ ఫలితాలను సాధించడంలో నిదర్శనం అన్నారు.




