313 Views
ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 20, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవంలో పురస్కరించుకొని మండలంలోని తెర్లుమద్ది గ్రామంలో విద్య” దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంనుంచి విద్యావ్యవస్థలో వచ్చిన గుణాత్మలో, పరిమాణాత్ముక మార్పులను అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ పాఠశాలలో పతాకం ఎగరవేసి వందనం చేశారు. ఆగస్ట్15నా విద్యార్థులకు ఆటల పోటీలకు సంబంధించిన ప్రైజెస్ బుక్స్ విరాళంగా ఇచ్చిన విద్యకమిటీ చైర్మన్ కొమ్మెట రాజును శాలువాతో ఘనంగా సన్మానించారు. పాఠశాల ఆధ్వర్యంలో చైర్మన్ రాజు మాట్లాడుతూ విద్యారంగంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనఊరు మనబడి” కార్యక్రమంతో పాటు ఒక వేయికి పైచిలుకు గురుకులాల స్థాపన, నూతన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు (ఆర్టికల్చర్ ఫారెస్ట్ మహిళా హెల్త్ యూనివర్సిటీ తదితర) జిల్లాకి ఒకటి చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల రెసిడెన్షియల్ తో సహా తదితర వివరాలను వెల్లడించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ పంచాయతీ కార్యదర్శి వార్డ్ మెంబెర్స్ గ్రామప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు. No Slide Found In Slider.
Poll not found




