ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 13, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని దానిలో భాగంగా ముస్తాబాద్ మండల పోలీసువారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంవద్ద ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గెలుపొందిన వారికి వేములవాడ ముఖ్య అతిథులుగా సబ్ డివిజన్ అధికారి కే.నాగేంద్రచారి చేతుల మీదుగా ప్రథమ బహుమతి 1.బి భవాని, ద్వితీయ బహుమతి 2.స్వప్న, తృతీయ బహుమతి, 3. ఎం.కళ్యాణి, లకు ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు, సిబ్బంది, మహిళలు, ఆశ వర్కర్లు, జెడ్పిటిసి గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మండల కో ఆప్షన్
షాదులుపాప, కోడె శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




