ప్రాంతీయం

రైతులవద్ద వివరాలు సేకరించకుండానే వారికీ ఎలాంటి సహకారాలు అందించడం చేతకాదుకానీ ధర్నారాస్తారోకో చేస్తారా… దమ్ముంటే చర్చలకు దిగుదాం మేము రెడీ… మీరు రెడీనా బిఆర్ఎస్…

284 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే,3 అధికారం చేపట్టాలనే దురాశతో ముందుకు సాగుతున్న ఎన్ని పన్నాగాలు పన్నిన బీజేపీ.. రాష్ట్రంలో అధికార బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు తెలంగాణలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ నాయకులు ధర్నా చేయడానికి మరి ఎక్కడ గ్రామాలు లేవా పోతుగల్ సహకార సంగం ఎదుట ధర్నాచేయడం రైతుల వద్దకువెళ్లి పూర్తిగా వివరణ తీసుకోకుండా అర్థంలేని మాటలతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నారు పోతుగల్ సింగిల్విండో చైర్మన్ బాపురావు రాష్ట్రంలో అధికార బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు చేతకాక బిఆర్ఎస్ పార్టీని చూసి జీర్ణించుకోలేకనే వరుస కార్యక్రమాలను రూపొందిస్తూనే ఉందని అన్నారు. ఈనేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు వినూత్న కార్యక్రమాలకు తెరలేపాలని ప్రజల్లోకి బలంగా పోయే విధంగా వ్యూహాలు చేస్తున్నారని అవేమీ పప్పులు ఉడుగవని ఉడుత బెదిరింపులకు భయపడమని వైస్ చైర్మన్ మెరుగు రాజేశంగౌడ్ మండిపడ్డారు. దమ్ముంటే చర్చలకు మేంరెడీ మీరు రెడీనా అని సవాల్ చేశారు. అయితే, ప్రజలను చైతన్య పరిచే విధంగా ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందనే విషయంలో సమగ్ర ఆలోచనలో బీజేపీ నేతలు..మీట్లు, బ‌హింర‌గ స‌భ‌లు, పాద‌యాత్రలు, దీక్షలు, ధ‌ర్నాలు ఇలాంటి కార్యక్రమాలు రాజ‌కీయ పార్టీలు చేయ‌డం స‌హాజం. కానీ బీజేపీ నేత‌లు ఇప్పుడు తెలంగాణలో విన్నూత కార్యక్రమాల‌కు శ్రీకారం చుట్టాల‌ని అనుకుంటున్నారు. అదివారి భ్రమ తెలంగాణలో అధికారం ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్న క‌మ‌లం పార్టీ నేత‌ల‌కు, బిఆర్ఎస్ నేత‌ల‌కు ప‌చ్చగడ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత వైరం పెరిగింది. ప‌రస్పర అరోప‌ణలతో నువ్వా-నేనా అన్న చందంగా మాట‌ల యుద్ధానికి నేత‌లు దిగుతుంటే, క్షేత్ర స్థాయిలో కార్యక‌ర్తలు యుద్ధ స్థాయికి దిగుతున్నారు. అయితే ఇవి ఇలా కొన‌సాగిస్తునే బిఆర్ఎస్ ను బ‌ల‌హీనప‌రిచే కార్యక్రమం చేయాల‌ని క‌మ‌లం పార్టీ నేత‌లు ఆలోచిస్తున్నారన్నారు ఓవైపు పకృతి వైపరీత్యం వల్ల అన్నదాతలు ఎందరో నష్టం పోతున్నారు. వారికి సహాయపడండి ధర్నా రాస్తారోకోలు కాదు ప్రభుత్వం తరఫున ఎకరాకు పదివేల రూపాయలు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం ప్రభుత్వం 19 వేల ఎకరాలు ఇప్పటివరకు గుర్తించిన వడ్లు మొలకెత్తిన కొంటామని ప్రభుత్వం ఓవైపు చెబుతున్న పట్టించుకోకుండా బిఆర్ఎస్ పార్టీ మీద నిందలు మోపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఏరాష్ట్రంలో చేసిందని మండిపడ్డారు. ఈకార్యక్రమంలో మండలంలోని గంభీరావుపేట బాలయ్య, గన్నె ఆనందు, రాజేశ్వరరావు, తదితర డైరెక్టర్లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *