ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి
వర్గల్ క్షేత్ర ఆహ్వాన పత్రిక అందజేత
పురాతన వర్గల్ శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13వ తేదీ వరకు జరగనుండగా , బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టేకులపల్లి రాoరెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని స్పష్టం చేశారు . వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వర్గల్ ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దృష్టి పెట్టాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు . ఈ కార్యక్రమంలో న్యాయవాది అశోక్ రెడ్డి , నేతలు బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు




