ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, పోతుగల్ సహకార సంఘం ముందు బీజేపీ ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవాలని ధర్నారాస్తారోకో చేశారు. రైతులు ఆరుకాలం పండించిన పంటలను చేతి కంది దశలో అకాల వర్షానికి వరిచేలు నేలకోరిగాయి కొంతమంది రైతులు కోసిన వడ్ల కుప్పలపై వర్షంపడి తడిసి ముద్దయి వరదల దాటికి నీటిలో కొట్టుకుపోతున్నాయి మరికొన్ని నానిన వడ్లు మొలకెత్తాయి ఇలాంటి పరిస్థితులలో రైతులు పండించే వడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా త్వరితగతిన ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి, మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, నియోజకవర్గ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోలా కృష్ణ, కిసాన్మోర్చా మండల అధ్యక్షుడు వెంకటేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు జనార్ధన్, మీసా శంకర్, స్వామి, బండి శ్రీకాంత్, ఆది శేఖర్, రాంగోపాల్, శ్రీకాంత్, ఉపేంద్ర, శ్రీనివాస రావు, పిఎసియస్ డైరెక్టర్ మిడిదొడ్డి దేవేందర్, జిల్లా సహాయ కార్యదర్శి బాధా నరేష్, శీల భాను, తదితరులు పాల్గొన్నారు.




