
జగదేవపూర్ మండలం లోని బి.జి వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంను బుధవారం పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తో కలిసి స్థానిక సర్పంచ్ మంజుల రమేష్ ఎంపీటీసీ కిరణ్ గౌడ్ లు ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో వారి వెంటఉపసర్పంచ్ శ్రీకాంత్ ,మండల అధికార ప్రతినిధి పరమేశ్వర్,కొండపోచమ్మ డైరెక్టర్ నరేష్ ,గ్రామ అధ్యక్షుడు బాబు,సుధాకర్, వెంకటేష్, బాలు,ఫిల్డ్ అసిస్టెంట్ నర్సింలు, కార్యదర్శి తిరుపతి వార్డు సభ్యులు వైద్య సిబ్బంది గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.




