
జగదేవపూర్ మండలం లోని మునిగడప గ్రామంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో స్థానిక సర్పంచ్ బాలక్ష్మి ఐలయ్య, స్థానిక ఎంపీటీసీ కిరణ్ గౌడ్ తో కలిసి రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ లు శ్రీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామంలో అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులను పరామర్శించి నష్ట పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆదుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు స్వామి,పిఏసీఎస్ డైరెక్టర్ శ్రీను,బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్,నాయకులు హరిగౌడ్, రవి,భిక్షపతి,నాగయ్య,గ్రామస్థులు తదితరులు ఉన్నారు.




