ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 17, ఉద్యోగ భద్రత కోసం టవర్ ఎక్కిన యువకుడు….
ముస్తాబాద్ మండలం నామపురం గ్రామలో ఆదాని గ్రూపుకి చెందిన సోలార్ పవర్ ప్రాజెక్టులో దీకొండ దశరతం, అనే యువకుడు గత 6 సంవత్సరాల నుండి సోలార్ పవర్ కంపెనీలో ఉద్యోగం సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నాడు . దశరథమ్ అతనిపై ఉన్న అధికారి సెక్యూరిటీ ఇంచార్జ్ శ్రీమన్ ప్రతి రోజు వేధింపులకు గురిచేస్తూ నాకు ఎలాంటి నోటీలు ఇవ్వకుండా ఉద్యోగం నుండి తొలగించి వేరే వ్యక్తిని నియమించడంతో దశరతం మనస్థాపనికి గురై విద్యుత్ హై టెన్షన్ టవర్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఇంతలోనే పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, సోలార్ ఇంచార్జ్, లవన్ కుమార్, నచ్చచెప్పి నీకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దశరతం టవర్ దిగాడు.




