151 Views
- హనుమాన్ విజయోత్సవం నాటికి లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహా యజ్ఞానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన కరపత్రాలను సత్యసాయిబాబా మందిరంలో ఆదివారంనాడు ఆవిష్కరించారు. అనంతరం అందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీరామకోటి భక్త సమాజం భక్తులచే ప్రతిరోజు పారాయణం చేయించి సంకల్పించామని మరియ గ్రామ గ్రామ ఉన్న భక్తులు, భజన మండలి సభ్యులు 5రోజుల పాటు నిర్విరామంగా జరిగే హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొననున్నట్లు తెలిపారు. సామాజిక సమరసన జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ అద్భుత కార్యక్రమానికి రామకోటి రామరాజు శ్రీకారం చుట్టడం ఆయన భక్తికి నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గారి శ్రీహరి, మాలే శంకరయ్య, రాచకొండ శ్రీనివాస్, గుంటుకు శ్రీను, మంగలపల్లి హనుమంతు, సంగని మధుబాబు, లక్ష్మణచారి, కర్ణాల గణేష్, పాతరాజు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found