ముస్తాబాద్ మండలం నామాపురం గ్రామంలొ కుక్కల దాడిలో సుమారు 35 గొర్రెలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే నామాపురం గ్రామానికి చెందిన నిరుపేద రైతు చిట్టేవేని నర్సింలు గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు రోజు మాదిరిగానే గొర్రెలను జాలీల లోపల తోలాడు శనివారం అర్ధరాత్రి దాటాక కుక్కలు జాలి కింది నుండి గండిచేసి దాడికి చేసి 35 గొర్రెలను తీవ్రంగా గాయపరచడంతో మృతి చెందాయి. ఆదివారం తెల్లవారుజామున చూసేసరికి ఉదయం విచారకమైన సంఘటన చూసి గొర్రెల కాపరి అతని భార్యతో పాటు రోధనలు మిన్నంటాయి. స్థానికులు తెలిపిన ప్రకారం గొర్రెల కాపరికి మూడు లక్షల పైగా నష్టం వాటిల్లిందని ఈనిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని చనిపోయిన గొర్రెల రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.




