భుంపల్లి-అక్బర్ పేట మండలం పోతరెడ్డి పేట గ్రామం ఇటివలే రోడ్డు ప్రమాదంలో బండారి స్వామి గౌడ్ మరణించిన విషయం తెలుసుకొని బుధవారం దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ వారి కుటుంబ సభ్యలను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టి నాయకులు కొత్త దేవిరెడ్డి (బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దుబ్బాక), మిద్దె భూపాల్ గౌడ్, ప్రభాకర్ చారి, శ్రీనివాస్ గౌడ్ పెద్దచికోడు దేవరాజు, ఐరెని సాయి తేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




