ఇన్స్పైర్ మనక్ పోటీల్లో జాతీయస్థాయికి ఎన్నికైన దామరకుంట విద్యార్థిని బి. సింధుజ
సిద్దిపేట జిల్లా,మార్కుక్ జనవరి 10, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ ఇన్స్పైర్ మనక్ పోటీల్లో జాతీయస్థాయికి ఎన్నికైన దామరకుంట విద్యార్థిని బి సింధుజ,గత మూడు రోజులుగా( జనవరి 7 నుండి 9)కామారెడ్డి జిల్లా కేంద్రం లో గల విద్యానికేతన్ పాఠశాలలో ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ 53వ రాజేశ్వరి,రాజ్య స్త్యరియా బాల వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరకుంట మర్కుక్ మండల, సిద్దిపేట జిల్లా నుండి పదవతరగతి విద్యార్థిని బి సింధుజ , గైడ్ టీచర్ మార్గదర్శకత్వంలో తయారు చేసిన పెస్టిసైడ్ లను పిచికారి చేసే యంత్రంతో పాటుగా యూరియాను రెండు వైపులా అతి సులభంగా వేసే , ఎటువంటి విద్యుత్ శక్తి గాని , బ్యాటరీలు కానీ అవసరం లేకుండా కేవలం కేవలం ట్రాలీను నెట్టడం ద్వారా “చక్రo ఇరుసు సూత్రం” ఆధారం గా పనిచేసే , వీల్ ఫెస్టిసైడ్స్ స్పియర్ పనిచేస్తుంది .దీనికి తోడుగా నట్ అండ్ బోల్డ్ సిస్టం ద్వారా రైతుకు తన పని అవసరానికి తగ్గట్టుగా మేము తయారు చేసిన పనిముట్లను అమర్చుకోవచ్చు అవి కలుపు తీసే యంత్రం, మెత్తని సాలు ల మధ్య దున్నే పరికరం, గడ్డి కోసే యంత్రము ఇలా ఒకే పరికరం ద్వారా 11 రకాల పనులను రైతులు స్వతగా ఒక్కరే , స్త్రీ గాని పురుషులు గాని అతి సులభంగా చేసుకునే పరికరంను స అద్భుతంగా ప్రదర్శించి జాతీయస్థాయికి ఎన్నికైన సందర్భంగా స్థానిక శాసనమండలి అంజి రెడ్డి, చేతుల మీదుగా ప్రశంసా పత్రమును మెమొంటోను అందుకున్న సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు , మండల విద్యాధికారి ఏ, వెంకట రాములు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పి బాల్ రెడ్డి, ఇతర ఉపాధ్యాయ బృందఓ, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ , విద్యార్థి సింధూజ ను గైడ్ టీచర్ వై చిన్న బ్రహ్మయ్య, భౌతిక శాస్త్రమును అభినందనలు తెలియపరిచారు.





