జగదేవపూర్ మండల కేంద్రం లోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం పశువుల తై బజార్ వేలం పాటను స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు.ఈ వేలం పాటలో పశువుల సంతను వేలం వేయగా వేలం పాటను 34,01,000 కి నాగరాజు దక్కించుకున్నారు. కూరగాయల తై బజార్ వేలం పాటను రేపటికి వాయిదా వేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేశం కో అప్షన్ శ్రీనివాస్, వార్డు సభ్యులు కల్పన, రాజు, కరుణాకర్, గణేష్, సత్యం, కొండపోచమ్మ డైరెక్టర్ కనకయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది మర్రెడ్డి,బాలయ్య,సాంబయ్య,రాజు,బాలరాజు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.




