గజ్వేల్ పట్టణంలో శుక్రవారం రోజున ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం గజ్వెల్ పట్టణ ఇన్చార్జి గురువారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ టిఎస్ పి ఎస్ పేపర్ లీకేజీ పై ఆరోపణలు వచ్చినప్పుడు ఐటీ మంత్రి కేటీఆర్ మాకు ఏలాంటి సంబంధం లేదు అనడం సిగ్గుచేటు అని ఐటి మంత్రి కేటీఆర్ ను విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలని నిరుద్యోగులకు లక్ష రూపాయల జీవనభృతి ఇవ్వాలని శనివారం రోజున జరగబోవు బండి సంజయ్ మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు నాలగామ శ్రీనివాస్, కార్యదర్శి కుడిక్యాల రాములు, బీజేపీ సీనియర్ నాయకులు ఏల్లు రామ్ రెడ్డి, నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.




