ప్రాంతీయం

పద్మశాలి సంఘానికి ఏకధాటిగా మూడవసారి అధ్యక్షులుగా ఏకగ్రీవం తడుక బాలకిషన్…

385 Views
    ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 23,  మండల కేంద్రంలో శ్రీమార్కండేయ ఆలయంలో ఉగాది పర్వదినము, శ్రీ శోభకృత్ నామ సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై సమావేశం జరిపిన అనంతరం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మూడవసారి తడుక బాలకిషన్, ఉపాధ్యక్షులుగా గౌడ మల్లేశం, ఎనగందుల దశరథము, ప్రధాన కార్యదర్శులుగా దొంత బాలరాజు, బిట్ల దేవానందం, కోశాధికారిగా గౌడ కృష్ణారి, చిట్టి కోశాధికారిగా శ్రీరామ్ మనోహర్, గౌరవ సభ్యులుగా దోమల లక్ష్మీనారాయణ, తడుక లక్ష్మీనారాయణ, బిట్ల దేవానందం, దండె రామకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా గౌడ సహదేవు, మెరుగు భూమేషు, గౌడ మల్లేశం, మారెల్లి శ్రీనివాసు, తడక ప్రభాకర్, దొంత బాలరాజు, బిట్ల సంతోష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు సన్మానించి అభినందించారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *