రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు వ్రాసే సిద్దిపేట జిల్లా విద్యార్థిని, విద్యార్థులకు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని మీరు కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నాను అని మీ మంచి భవిష్యత్తు కి ఇది పునాది లాంటిదని పరీక్షలు బాగా రాసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి వారి కలలను నిజం చేయాలని ఆకాంక్షించారు.అదే విధంగా మంచి ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా అగ్రస్థానంలో నిలపాలని అన్నారు.
