*రామగుండం పోలీస్ కమిషనరేట్*
అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్, ఆటో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష్, టాస్క్ ఫోర్సు సిబ్బందితో కలిసి పెద్దపల్లి జోన్ బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల గ్రామం లో ఒక షెడ్ లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచారనే సమాచారం మేరకు తనిఖీ చేయగా అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులను వ్యక్తిని అదుపులోకి తీసుకుని, పిడియస్ రైస్ తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఆటో ట్రాలీ, నిల్వ ఉన్న సుమారు 20 క్వింటల్లా బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
పట్టుబడిన నిందితుడి వివరాలు
1.బోయిని పెద్ద రాజాం , గోదావరిఖని.
2.పాస్తం బాబు, కన్నాల.
స్వాదినపరుచుకున్న 20 పిడిఎస్ రైస్, ఆటో మరియు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం బసంత్ నగర్ పోలీస్ వారికీ అప్పగించడం జరిగింది. వాటి విలువ సుమారు 78,000 రూపాయలు.





