ప్రాంతీయం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా… పురుషులతో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగతి సాధించిన నాడే దేశాఅభివృద్ధి…

363 Views
       ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి8 రాజన్న సిరిసిల్ల బిసి స్టడీ సర్కిల్ లో జరిగిన మహిళ దినోత్సవానికి అసిస్టెంట్ బిసి సంక్షేమశాఖ అధికారి సంపూర్ణ ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, జీవితాన్ని మార్చే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉన్నదని, కావున ప్రతిఒక్కరు శ్రద్ధగా చదువుకొని జీవితంలో ఉన్నతస్థాయికి రాణించాలని సూచించారు.
ఈకార్యక్రమంలో వార్డు కన్సిలర్. శ్రీనివాస్ మాట్లాడుతూసమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమౌతుందని అన్నారు. అలాగే సఖి మేనేజింగ్ డైరెక్టర్ రోజా మాట్లాడుతూ మారుతున్నా కాలాన్ని అనుగుణంగా అటు రాజకీయల్లో,ఇటూ ఉద్యోగాలల్లో,స్వయం ఉపాధిలో పురుషులకు దీటుగా రానిస్తూ తోటి మహిళలకు ఆదర్శనంగా నిలుస్తున్నారని తెలిపారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి మాట్లాడుతూ నన్ను ఇ ప్రపంచానికి పరిచయం చేసినా మా అమ్మకు మరియు, మహిళ మణులందరికీ  మహిళ దినోత్సవా శుభాకాంక్షలు తెలుపుకుంటూ చదువుల తల్లి సావిత్రి భాయి ఫూలే, చాకలి ఐలమ్మ ,రాణి రుద్రమ్మ, సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో నరేందర్ ఆడబిడ్డలు సాధికారత సాధించాలని మనసారా ఆకాంక్షిస్తూ మహిళాదినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *