ప్రాంతీయం

మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించాలి

107 Views

మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు  నిర్వహించి తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం మార్చి 8న మహిళా దినోత్సవం నాడు 100 ఆరోగ్య మహిళ కేంద్రాలనుప్రారంభిస్తుందని, ప్రతి మంగళవారం ఈ కేంద్రాలలో మహిళలకు పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర సీఎస్ శాంతికుమారిలతో కలిసి ఆరోగ్య మహిళ, సిపిఆర్ శిక్షణ, కంటి వెలుగు, వడ్డీ లేని రుణాలు, తదితర అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశం మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాజేంద్రనగర్ లో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సిపిఆర్ నిర్వహించడం వల్ల రాజశేఖర్ అనే వ్యక్తి ప్రాణాలు కాపాడటం జరిగిందని, కరోనా తరువాత కారణాలు తెలియకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మంది ఆకస్మికంగా గుండె పోటు వచ్చి చనిపోతున్నారని, ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో 19 సంవత్సరాల యువకుడు పెళ్లి వేడుకలో మరణించారని, సిపిఆర్ చేయడం వల్ల ఆకస్మికంగా గుండె పోటు వచ్చే వారిలో 50% మంది ప్రాణాలు కాపాడవచ్చని మంత్రి తెలిపారు. వైద్య శాఖ అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 24 వేల మంది ఆకస్మిక గుండె పోటుతో చనిపోతున్నారని, వీరిలో సగం మందిని కాపాడే అవకాశం సిపిఆర్ ద్వారా లభిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి సిపిఆర్ శిక్షణ అందించాలని, హెల్త్ వర్కర్స్, స్వశక్తి మహిళా సంఘాలు, ఆర్టిసి సిబ్బంది, పోలిస్ సిబ్బంది, షాపింగ్ మాల్స్ , అపార్ట్మెంట్ నిర్వాహకులు, టీచర్స్ మొదలగు వివిధ వర్గాల ప్రజలకు శిక్షణ అందించడం జరుగుతుందని, ప్రతి జిల్లాలో మార్చి 13 నుంచి సిపిఆర్ శిక్షణ ప్రారంభించాలని , స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని మంత్రి తెలిపారు. జిల్లాలో సిపిఆర్ శిక్షణ అందించేందుకు ప్రతి జిల్లాకు 5 నుంచి 7 మాస్టర్ ట్రైయినర్లను అందుబాటులో ఉంచి ప్రతి రోజూ కనీసం 300 మందికి శిక్షణ అందించేలా కలెక్టర్ లు పర్యవేక్షణ చేయాలని, జిల్లాలో మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200 ఆరోగ్య కేంద్రాలలో ఏఈడీ యంత్రాలను 18 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 63.82 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి 11.42 లక్షల మందికి రీడింగ్ కళ్ళద్దాల పంపిణీ, 8.02 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను అందించుటకు ఆర్డర్ చేశామని అన్నారు. జిల్లాలో ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను సకాలంలో పంపిణీ చేయాలని, కలెక్టర్ లు ప్రతి రోజూ వీటిని పర్యవేక్షించాలని, ప్రతి రోజూ ప్రతి శిబిరానికి కనీసం 100 మంది వచ్చేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని మంత్రి తెలిపారు. మార్చి 8న మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాలలో ముందస్తుగా ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో వీటిని మరింత విస్తరిస్తామని మంత్రి హరిష్ రావు తెలిపారు. ఆరోగ్య మహిళ క్రింద ప్రతి మంగళవారం 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తిదవాఖానాలో మహిళల కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ క్లినిక్ లో మహిళల కు 8 ప్యాకేజీ లో 57 రకాల పరీక్షలను చేయడం జరుగుతుందని, ప్రాథమిక డయాగ్నాస్టిక్, క్యాన్సర్ స్క్రీనింగ్, వెయిట్ మేనేజ్మెంట్, మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ, సెక్సువల్ ట్రాన్స్ మిటెడ్ ఇన్ఫెక్షన్, పిసిఓడి, రుతుస్రావ సమస్యలు, ఇన్ ఫెర్టిలిటీ మేనేజ్మెంట్, మెనోపాజ్ మేనేజ్మెంట్, ఐవి, యూటిఐ & పెల్విక్ ఇన్ ఫ్లమేంటరి డిసిజెస్ వంటి అంశాలు పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాలలో తెలంగాణ డయాగ్నిస్టిక్ అందుబాటులో ఉన్నాయని, ఏప్రిల్ చివరి నాటికి మరో 7 జిల్లాలో ఏర్పాటవుతాయని అప్పటి వరకు సమీప జిల్లాకు లింక్ చేశామని, శాంపిల్ ఇతర జిల్లా కేంద్రాలకు తరలించేందుకు అదనపు వాహనాలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. మహిళా క్లినిక్ కు వచ్చే పేషెంట్ల వివరాలు ప్రత్యేక యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని, వీటిని రిఫరల్ ఆసుపత్రికి లింక్ చేస్తామని, జిల్లా ఆసుపత్రిలో ఇబ్బందులు కల్గకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో త్వరితగతిన నిర్మాణంలో ఉన్న సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులు, ఇతర మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మహిళా దినోత్సవం నాడు 2 సంవత్సరాల పెండింగ్ వడ్డి లేని రుణం బకాయిలు 650 కోట్ల నిధులు విడుదల చేయడం జరుగుతుందని, జిల్లా స్థాయి వేడుకలలో గ్రామీణ సంఘాలకు , మెప్మా సంఘాలకు చెక్ లు అందించాలని మంత్రి తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పోడు ల్యాండ్ పట్టాల పంపిణీ, జీవో నెంబర్ 58,59, తెలంగాణకు హరితహారం, ఐడిఓసిలలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకం తదితర అంశాలపై సమీక్షించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్లలో జిల్లా అటవీ అధికారి శ్రీనివాస్ , జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సంపత్, ఏసీపీ దేవారెడ్డి, సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *