నేరాలు

ఇసుకను తరలిస్తే ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదు ….ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్

145 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోఅక్రమంగా ఇసుక తరలిస్తున్న పికప్ పై కేసు నమోదు శుక్రవారం రోజున ఉదయం ఎస్ఐ వచ్చిన నమ్మదగిన సమాచారంపై నారాయణపురం గ్రామ శివారులో పెట్రోల్ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా ఇసుకలోడుతో పికప్ BN.TS23T.8993రాగా దానిని ఆపి అట్టి డ్రైవర్ కు ఇసుక తరలించడానికి అనుమతులు చూపమని అడగగా అతని వద్ద ఎలాంటి అనుమతులు లేవని అక్రమంగా ఇసుక తరలిస్తున్నానని తెలిపి తన పేరు శివరాత్రి మహేష్ ,తండ్రి ఎల్లయ్య ,వడ్డెర, నారాయణపూర్ ,, పికప్ ఓనర్ అయిన శివరాత్రి నరసింహులు వడ్డెర ,రాజన్నపేట ,అను అతని ఆదేశాల మేరకు నారాయణపూర్ వాగులో నుండి ఇసుక నింపుకొని దానిని ఎల్లారెడ్డిపేటలో అమ్మడానికి వెళ్తున్నారని చెప్పడం జరిగింది. వెంటనే ఎస్ఐ ఎల్లారెడ్డిపేటపికప్ ను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఎల్లారెడ్డిపేట శేఖర్ మీడియాతో తెలిపారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *