దౌల్తాబాద్ మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన రైతులు మంగళవారం గొడుగుపల్లి గ్రామంలో జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కలిసి గ్రామంలోని పల్లె చెరువుకు వెళ్లే ఫీడర్ ఛానల్ పై కల్వర్టు అవసరం ఉన్నదని వారు తెలిపారు. ఈ కల్వర్టు వల్ల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేపిచ్చే ప్రయత్నం చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు బాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, పంజా స్వామి, గోవర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ముత్యంరెడ్డి, బాపురెడ్డి, స్వామి తదితరులు ఉన్నారు.




