గజ్వేల్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి రామజోగి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ క్షత్రియ రామజోగి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి కులానికి ప్రాధాన్యత ఇస్తూ అందులో భాగంగా తెలంగాణ క్షత్రియ రామ జోగి కులం సమాజానికి అన్ని విధాలా అండగా ఉంటుందని నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న క్షత్రియ రామజోగి సమాజానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, తెలంగాణ క్షత్రియ రామజోగి అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గుజ్జేటి వెంకటేశం, ఉపాధ్యక్షులు గుజ్జేటి శ్రీనివాస్, సభ్యులు రామచంద్రం, కిరణ్, రాజు, భారతి, లక్ష్మి, సుమలత, వసంత, తదితరులు పాల్గొన్నారు




