ప్రాంతీయం

బీడీ కార్మికుల కనీసవేతనం జీవోను విడుదల చేయాలి.. బిఎంఎస్ మజ్దూర్ సంఘం జిల్లాఅధ్యక్షులు తోటధర్మేందర్…

263 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 2, కార్మికుల హక్కులకోసం 14 ఫిబ్రవరిన చలో హైదరాబాద్ కరపత్రాల ఆవిష్కరణ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీడీ కార్మికుల బతుకులు మారుతాయని ఉద్యమ సమయంలో కెసిఆర్ అన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు బీడీ కార్మికులకు కనీస వేతన జీవోను విడుదల చేయలేదు. జీఎస్టీ మీటింగ్లలో కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులకు తలఊపి రాష్ట్రంలో మాత్రం ఈపన్నును వ్యతిరేకిస్తున్నామని చెప్తూ కార్మికులను మోసం చేస్తుంది. సి ఓ పి టి ఏ చట్టం, ఇపీఎఫ్ వొ ద్వారా జిఎస్ ఆర్ 226 (ఇ) 2015 పిఎఫ్ సర్వీస్ క్యాంట్రిబ్యూటరీ సర్వీస్ అంటూ 20 ఏళ్లు పనిచేసిన పింఛన్ రాకుండా కార్మిక సంఘాలను సంప్రదించకుండానే జివొ లు తీసింది. ఇఎస్ ఐ సమస్యలు కార్మికుల సంబంధించిన పలు సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం దృష్టికి మన కార్మిక సమస్యలను తీసుకపోవడానికి (బిఎంఎస్) భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈర్యాలీ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీడీ కార్మికులందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని (బిఎంఎస్) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్ పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ముస్తాబాద్ మండలంలో ఉన్న దేశాయి బీడీ కంపెనీలో బీడీ కార్మికుల చేతులమీదుగా చలో హైదరాబాద్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో (బిఎంఎస్) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, చంద్రమౌళి, మచ్చ ప్రవీణ్, తడుక ప్రభాకర్, ముచ్చర్ల నరేశ్, కోంక రాజు, శ్రీనివాస్, నగేష్, సకినాల పద్మ, లత, బీడీ కార్మికులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *