మహాత్మగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని అర చేతిలో పట్టే అతిచిన్న మందారం ఆకు మీద మహాత్మగాంధీ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి సోమవారంనాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన దేశభక్తిని చాటుకున్నాడు. గజ్వేల్ పట్టణానికి చెందిన కళరత్న రాష్ట్రస్థాయి అవార్డ్ గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం బియ్యంతోను, మరొక్క సారి సబ్బుబిళ్ల మీద వేశానన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించినా వ్యక్తి. సత్యము, అహింసా ఆయన సిద్ధాంతాలని జాతిపితగా మనం గౌరవిస్తాం అన్నారు.




