ముస్తాబాద్ వెంకటరెడ్డి ఆంధ్రప్రభ
జనవరి 30, ముస్తాబాద్ మండల కేంద్రంలోని సంబంధిత పరిధిలో మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి శీతల పానీయాల, మేకల మాంసం, కోళ్ల మాంసం, విక్రయదారుల మరే ఇతర సముదాయాలో తనిఖీ చేయగా ప్లాస్టిక్ కవర్లు లభించిన వాటిని సీజ్ చేసినారు. మండల కేంద్రంలోని రద్దీగా వెళుతున్న గోల్డెన్ బేకరీ లో తనిఖీ చేయగా కాలం చెల్లిన శీతల పానీయాలు లభించాయి అందుకు ఆ యజమానిపై జరిమానా 5000, రూపాయలు పంచాయతీ కార్యదర్శి విధించారు. ఇకముందు అయినా కాలం చెల్లిన వస్తువులు అమ్మి ప్రజల ప్రాణాలకు హాని చేయకూడదని ఇలా కాలం చెల్లిన వస్తువులు విక్రయించినా ప్రోత్సహించిన తగుచర్యలు తప్పని వ్యాపారస్తులకి హెచ్చరించి మరీ చెప్పారు.




